సంబంధిత వార్తలు
- ఆ ఒక్క సీన్ నన్ను ఇప్పటికీ బాధిస్తోంది, రాశీ ఖన్నా
- నాకు నచ్చిన హీరో విజయ్.. ఛాన్సొస్తే వదిలిపెట్టను : 'ఆర్ఎక్స్100' భామ
- మా మమ్మి మమ్మల్ని ఇంకా 'రియల్ మ్యాన్'లా చూడట్లేదు .. హీరో ఆవేదన
- విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం - ఆలోచనలో పడ్డ టాలీవుడ్ డైరెక్టర్స్
- విజయ్ దేవరకొండ కనిపించడంలేదు, అభిమానుల ఫిర్యాదు...?
విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ చేతులు మారింది..!
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ఫైటర్. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ముంబాయిలో నలభై రోజులు షూటింగ్ జరుపుకుంది. ఏప్రిల్ నెలలో తాజా షెడ్యూల్ ప్రారంభించాలి అనుకుంటే.. లాక్ డౌన్ వలన షూటింగ్స్ ఆగిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాని పూరి - ఛార్మి - కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
విజయ్ దేవరకొండ - బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జంటగా నటిస్తున్న ఈ సినిమా ముంబాయి బ్యాక్ డ్రాప్లో రూపొందుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా తర్వాత విజయ్ నిన్నుకోరి, మజిలీ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టు ఎనౌన్స్ చేసారు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజు నిర్మించనున్నట్టు ఎనౌన్స్ చేసారు.
అయితే.. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చేతులు మారిందని తెలిసింది. అవును.. విజయ్ - శివ నిర్వాణ కాంబినేషన్లో రూపొందే మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్నట్టు తెలిసింది. కారణం ఏంటంటే.. విజయ్తో మైత్రీ సంస్థ హీరో అనే సినిమాని ప్రారంభించింది. ఈ సినిమా కొంత షూటింగ్ జరిగిన తర్వాత ఆగిపోయింది. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది.
అందుచేత మైత్రీ వాళ్లకు సినిమా చేస్తానని మాట ఇచ్చారు విజయ్. అందుకనే పూరితో సినిమా అయిన తర్వాత దిల్ రాజు బ్యానర్ లో చేస్తానన్న సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో చేస్తున్నాడని తెలిసింది. అదీ..మేటరు.
తర్వాతి కథనం
