బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వెబ్‌దునియా స్పెషల్ 08
  3. బ్రహ్మోత్సవాలు
Written By ttdj
Last Modified: సోమవారం, 10 అక్టోబరు 2016 (19:37 IST)

బ్రహ్మోత్సవాలు... కన్నులపండువగా శ్రీవారి రథోత్సవం

వెంకన్న బ్రహోత్సవాలలో భాగంగా స్వామి వారు శ్రీదేవి భూదేవి సమేతంగా మహోన్నత రథంపై అధిష్టింపజేసి ఆలయ మాడ వీధులలో విహరింపజేశారు. శ్రీహరి గరుడధ్వజుడైన నాలుగు గుర్రాలు వుంచిన రథంపై స్వామి వారు విహరించారు. శరీరమే ఒక రథం, పంచేద్రియాలే గుర్రాలు, మనస్సు వాటిని

వెంకన్న బ్రహోత్సవాలలో భాగంగా స్వామి వారు శ్రీదేవి భూదేవి సమేతంగా మహోన్నత రథంపై అధిష్టింపజేసి ఆలయ మాడ వీధులలో విహరింపజేశారు. శ్రీహరి గరుడధ్వజుడైన నాలుగు గుర్రాలు వుంచిన రథంపై స్వామి వారు విహరించారు. శరీరమే ఒక రథం, పంచేద్రియాలే గుర్రాలు, మనస్సు వాటిని అదుపుచేసే పగ్గం, ఆత్మ రథచోదకుడైన స్వామని, అన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. 
 
ఇంద్రియాలను అదుపుచేసి నరతత్త్వం నుండి నారాయణతత్త్వం వైపు పయనించగలిగితే శరీర రథం భద్రంగా ఉంటుందన్న భావాన్ని చాటి చెప్పడానికే తేరుపై శ్రీహరిని తిరువీధుల్లో ఊరేగించారు. స్వామి వారికి జరిగే అన్ని వాహన సేవలను భక్తులు ప్రేక్షకులులాగా చూసి తరించడమే జరుగుతుంది. కానీ ఈ రథోత్సవంలో భక్తులు స్వయంగా పాల్గొని స్వామివారి తేరును ముందుకు తీసుకెళ్ళారు. 
 
అత్యంత భారీ తేరును భక్తజనులందరు గోవింద నామస్మరణ చేస్తూ రథం పగ్గాలను లాగుతుండగా మాడవీధులలో నెమ్మిదిగా రథోత్సవం జరిగింది. కఠోపనిషత్త..., రథోత్సవం విశిష్టమైన తత్వ్త జ్ఞానాన్ని ఆత్మకు శరీరానికి ఉండే సంబందాన్ని రథయాత్రతో పొల్చి వివరిస్తుంది.