1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. 14 days after marriage, bride elopes with priest who performed wedding rituals

వివాహం జరిగి 14 రోజులైంది... పెళ్లి చేసిన అర్చకుడితో కొత్త పెళ్లికూతురు జంప్..

Priest
వివాహం జరిగి 14 రోజులైంది. అంతే పెళ్లి చేసిపెట్టిన అర్చకుడితో కొత్తపెళ్లి కూతురు పరారైంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్, అజాద్ అనే గ్రామంలో గత ఏడో తేదీన ఓ జంటకు వివాహం జరిగింది. ఈ వివాహానికి ఆ ప్రాంతానికి చెందిన ఓ ఆలయ అర్చకుడు వినోద్ మహారాజ్ పండితుడిగా హాజరై.. పెళ్ళితంతును పూర్తి చేశాడు. 
 
అయితే వివాహం జరిగిన 16వ రోజున వున్నట్టుండి కొత్త పెళ్లి కూతురు అదృశ్యమైంది. కొత్త పెళ్లి కూతురు కనబడట్లేదని ఆ ఊరంతా తెలిసిపోయింది. అదే సమయంలో ఆ ఊరి ఆలయ అర్చకుడు కూడా మాయమయ్యాడు. ఇకపోతే.. కొత్త పెళ్లి కూతురు వెళ్తూ వెళ్తూ ఒకటిన్నర లక్ష రూపాయల విలువగల బంగారం, 30వేల రూపాయల నగదు తీసుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. 
 
ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు.. అర్చకుడితో కొత్త పెళ్లికూతురికి పెళ్లికి ముందు నుంచే తెలుసునని.. పెళ్లికి ముందే అతనితో చెట్టాపట్టాలేసుకుని ఆమె తిరిగేదని తెలిసింది. ఇక అర్చకుడికి ఇప్పటికే వివాహం జరిగిందని, ఇద్దరు సంతానం కూడా వున్నారని పోలీసులు తెలిపారు.
తర్వాతి కథనం
జగన్ ఎందుకలా మాట్లాడారు..? మోదీ బలం చూసి ఆందోళనతో అలా..?