శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 29 మే 2019 (19:41 IST)

పెళ్లి చేసిన పురోహితుడితో లేచిపోయిన మహిళ... ఎక్కడ?

తనకు మంచి వరుడుని చూసి అతనితో పెళ్లి చేసిన పురోహితుడుతో ఓ మహిళ లేచిపోయింది. పైగా, ఈ మహిళకు అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆ మహిళ పురోహితుడుతో లేచిపోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఆజాద్ నగర్‌కు చెందిన వినోద్ మరాజ్ అనే పురోహితుడు నిర్వహించేందుకు ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ, ఆ పురోహితుడు ముహూర్తం సమయానికి కనిపించకుండా పోయాడు. దీనిపై ఆరా తీయగా అసలు విషయం వెల్లడైంది. ఈ పూజారి మే 7వ తేదీన ఓ వివాహం జరిపించాడు. ముహూర్త సమయంలో వధువుపై మనసుపడిన వినోద్.. తన మనసులోని మాటను వెల్లడించారు. అయితే, ముహూర్త సమయంలో కావడంతో పాటు కళ్యాణ మండపంలో బంధువులు వచ్చివుండటంతో తన పని పూర్తిచేయలేకపోయాడు. 
 
పెళ్లి అయిన మూడు రోజులకు వధువుతో మాట్లాడిన పురోహితుడు ఆమెను తీసుకుని ఊరివదిలి పారిపోయాడు. ఆ నూతన వధువు పురోహితుడుతో లేచిపోయే సమయంలో రూ.1.50 లక్షల విలువ చేసే బంగారు నగలతో పాటు.. రూ.30 వేల నగదు, ఇతర వస్తువులను వెంట తీసుకెళ్లింది. ఇక్కడ విచిత్రమేమిటంటే.. ఆ మహిళకు అప్పటికే వివాహం జరుగగా, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్టు తేలిసింది.