సంబంధిత వార్తలు
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతే - తేల్చి చెప్పిన చంద్రబాబు!!
- ప్రమాణ స్వీకారం.. చిరంజీవికి ఆహ్వానం... పవన్కు భద్రత.. బాబు కసరత్తు
- కేసీఆర్ రూటులో జగన్మోహన్ రెడ్డి.. అసెంబ్లీకి వెళ్తారా?
- ఎన్డీయే కూటమి శాసనసభా పక్ష భేటీ.. ఏకగ్రీవంగా చంద్రబాబు ఎన్నిక
- జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా పవన్ కళ్యాణ్ ఏకగ్రీవ ఎన్నిక
నాక్కూడా పవన్, పురంధరేశ్వరిలకు వేసిన ఛైర్ వెయ్యండి: చంద్రబాబు (video)
ఆయన నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు. కానీ ఎంతమాత్రం అహంకారం, దర్పం కనిపించవు. సాదాసీదాగా వుంటారు. ఆయనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది.
స్టేజిపైన ఆశీనులయ్యే నలుగురికోసం కుర్చీలు వేసారు. ఆ నాలుగు కుర్చీల్లో రాష్ట్ర భాజపా అధ్యక్షులు పురంధేశ్వరి, తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెంనాయుడు కూర్చున్నారు. ఐతే చంద్రబాబుకి వేసిన కుర్చీ ప్రత్యేకమైనదిగా వున్నది. దీన్ని గమనించిన చంద్రబాబు.... తనకు కూడా మిగిలినవారికి వేసిన కుర్చీనే వేయాలంటూ చెప్పారు. దాంతో సిబ్బంది వెంటనే అలాంటి కుర్చీని తెచ్చి వేసారు.
CBN Sir సంస్కారంpic.twitter.com/4PA1DzB5qk
— Nani (@SriTDP999) June 11, 2024
