గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 23 జులై 2021 (21:44 IST)

అశ్లీల చిత్రాల కేసు: శిల్పాశెట్టిని పోలీసులు అరెస్ట్ చేసారా?

తన భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాతో సంబంధం ఉన్నట్లు ఆరోపించిన అశ్లీల చిత్రాలను విక్రయించిన కేసులో నటి శిల్పా శెట్టి వాంగ్మూలాన్ని ముంబై పోలీసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. తన భర్తకు అశ్లీల చిత్రాల వ్యాపారంతో సంబంధం ఉందని శిల్పాశెట్టికి తెలుసా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 
రాజ్ కుంద్రా వయాన్ అనే సంస్థను నడుపుతున్నాడు. దర్యాప్తు సమయంలో వచ్చిన కెర్నిన్ అనే మరొక సంస్థకు ఆర్థిక లావాదేవీలు వయాన్ ద్వారా పంపించబడ్డాయని వర్గాలు తెలిపాయి. రాజ్ కుంద్రా బ్యాంక్ ఖాతాల స్టేట్మెంట్లతో పాటు అతని కంపెనీ, కెర్నిన్ మధ్య లావాదేవీలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఐతే శిల్పాశెట్టిని సుదీర్ఘంగా ప్రశ్నిస్తుండటంతో ఆమెను అరెస్ట్ చేసారన్న వార్తలు ప్రచారమవుతున్నాయి.
 
మరోవైపు భర్త రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల కేసులో ఇరుక్కున్న తర్వాత నటి శిల్పా శెట్టి గురువారం రాత్రి తొలిసారిగా దీనిపై స్పందించారు. అశ్లీల చిత్ర నిర్మాణానికి సంబంధించిన కేసులో ఆమె భర్త రాజ్ కుంద్రాను అరెస్టు చేసిన కొన్ని రోజుల తరువాత శిల్పా శెట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా తెలిపింది.
 
"మనం ఉండవలసిన స్థలం ఇక్కడే ఉంది, ప్రస్తుతం. ఏమి జరిగిందో, ఏదైనా కావచ్చు అనే దానిపై ఆత్రుతగా చూడటం లేదు, కానీ జరిగింది ఏమిటో పూర్తిగా తెలుసు". "నేను సజీవంగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను. నేను గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను. నేను గతంలో సవాళ్లను తట్టుకున్నాను, భవిష్యత్తులో సవాళ్లను తట్టుకుంటాను. జీవితంలో ఇవి మామూలే. "
 
సోమవారం, రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు, అశ్లీల చిత్రనిర్మాణం, వాటిని యాప్స్‌లో ప్రచురించడం వంటి కేసులో అతను "కీలక కుట్రదారుడు"గా అభియోగం నమోదైంది. రాజ్ కుంద్రాపై తగిన ఆధారాలున్నాయని పోలీసులు తెలిపారు. శిల్పా శెట్టి పాత్ర చురుకుగా లేదని దర్యాప్తులో తేలిందని వారు స్పష్టం చేశారు.