సంబంధిత వార్తలు
- వర్క్ ఫ్రమ్ హోం సిబ్బంది కోసం జియో ప్రత్యేక ప్లాన్
- ఫ్రీ వాయిస్ కాల్స్.. జియో ప్లాన్స్లో మార్పు.. బెనిఫిట్స్ ఇవే..?
- డ్రైవింగ్ లైసెన్సుల గడువు పొడగింపు
- బీఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్.. రూ.365లతో ప్రీ-పెయిడ్ రీఛార్జ్ ప్లాన్
- రెండో భార్యకు ఆస్తి రాసిస్తే చెల్లుతుందా చెల్లదా? కరోనాతో మరణించిన ఎస్ఐ కేసులో కోర్టు ఏం చెప్పింది?
తెల్ల మొహం వేయొద్దు, మీరిచ్చే ఆ బ్యాంక్ చెక్ బుక్ చెల్లదు, ఎందుకో తెలుసుకోండి..
మొన్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో సగటు పౌరుడు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా వున్నాయి. ముఖ్యంగా ఇటీవల పలు బ్యాంకులను విలీనం చేశారు. ఈ క్రమంలో ఏప్రిల్ 1 నుంచి 7 బ్యాంకులకు సంబంధించిన పాస్ బుక్కులు, చెక్ బుక్కులు చెల్లవు.
ఆంధ్రా బ్యాంకు, దేనా బ్యాంకు, విజయా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంకులు వేర్వేరు బ్యాంకుల్లో విలీనమయ్యాయి. అవి ఏ బ్యాంకుల్లో విలీనమయ్యాయో తెలుసుకుని సంబంధిత బ్యాంకులను సంప్రదించి పాస్ బుక్, చెక్ బుక్ పొందాల్సి వుంటుంది.
అంతేకాదు... ఇకపై ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో ఏడాదికి రూ.2.5 లక్షలకు మించి ఉద్యోగి జమ చేస్తే అతడికి ట్యాక్స్ పడుతుంది. కనుక ఆ మొత్తాన్ని మించి జమ చేసుకునేవారు కాస్త ఆలోచన చేసుకోవాల్సిందే.
