1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జెఎస్కె
Last Modified: మంగళవారం, 6 జులై 2021 (09:56 IST)

తిమింగ‌లం లాలాజలం కూడా వ్యాపార‌మే, ఎన్ని కోట్లో!!

కాదేదీ దొంగ వ్యాపారానికి అన‌ర్హం అన్న‌ట్లు... కొంద‌రు పెద్ద దొంగ‌లు తిమింగ‌లం లాలాజ‌లాన్ని కూడా స్మ‌గ్లింగ్ చేస్తున్నారు. ఇదే కేసులో గుంటూరు జిల్లా నరసరావుపేట పోలీసులు 8 మందిని ప‌ట్టుకున్నారు. వారు నిషేధిత తిమింగలం అంబర్ గ్రీస్ (లాలాజలం) ని విక్ర‌యించే ముఠాగా పేర్కొన్నారు.

తిమింగ‌లం లాలాజ‌లాన్ని అంబ‌ర్ గ్రీస్ అంటార‌ట‌. దాన్ని కూడా ఆన్లైన్లో పెట్టి అమ్మేస్తున్నార‌ట ఈ ముఠా. ఇలా విక్రయించే ముఠాను పట్టుకున్న నరసరావుపేట పోలీసులు వారి నుంచి ఏడు కోట్ల  రూపాయల విలువ చేసే 8.25 కేజీల అంబర్ గ్రీస్ స్వాధీనం చేసుకున్నారు.

వీరిలో ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆరు బైకులు,ఎనిమిది సెల్ ఫోన్ లు సీజ్ చేసి, కేసు నమోదు చేశారు. నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.