1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. YSRCP won all 4 Rajyasabha seats in Andhra Pradesh

ఏపీ రాజ్యసభ 4 సీట్లూ వైసిపికే, చెల్లని తెదేపా 4 ఓట్లు

YSRCP
రాజ్యసభ ఎన్నికల్లో వైసీపి ఘన విజయం సాధించింది. మొత్తం 4 సీట్లను కైవసం చేసుకుని సత్తా చాటింది. వైసీపీ తరపున ఎన్నికల బరిలో నిలిచిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానిలు విజయం సాధించారు.
 
గెలుపొందిన ఒక్కో అభ్యర్థికి 38 ఓట్లు రాగా తెదేపా తరపున పోటీ చేసిన వర్ల రామయ్యకు 17 ఓట్లు వచ్చాయి. 4 ఓట్లు చెల్లలేదు. చెల్లని ఆ నాలుగు ఓట్లు తెలుగుదేశం పార్టీకి చెందినవి కావడం గమనార్హం. 
తర్వాతి కథనం
తమిళనాడులో కరోనా.. విద్యాశాఖ మంత్రికి కోవిడ్.. వేలల్లో కేసులు