1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2022
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (10:18 IST)

2022 వార్షిక బడ్జెట్: వైజాగ్ రైల్వే జోన్ పరిస్థితి ఏంటి?

భారతీయ రైల్వేలు ప్రైవేటీకరణ అంచున ఉన్న తరుణంలో విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే (ఎస్సీఓఆర్) జోన్ ఇప్పటికీ కలగానే మిగిలిపోయింది. కొత్త రైల్వే జోన్‌కు గత బడ్జెట్ 2021లో ఎలాంటి కేటాయింపులు చేయకపోవడంతో తీవ్ర నిరాశను మిగిల్చింది. ఈ నేపధ్యంలో 2022 వార్షిక బడ్జెట్టులోనైనా రైల్వే జోన్ ఏర్పాటుకు కేటాయింపులు వుంటాయేమోనన్న ఆశతో వున్నది ఏపీ.

 
కొత్త రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం 2020 బడ్జెట్‌లో కనీసం రూ.3 కోట్లు ప్రకటించింది. దీనికి విరుద్ధంగా, గత సంవత్సరం బడ్జెట్ సమర్పణలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అటువంటి ప్రకటన చేయలేదు. ఫిబ్రవరి 27, 2019న విశాఖపట్నం కేంద్రంగా ఎస్‌సిఒఆర్‌ జోన్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని రైల్వే మంత్రి అధికారికంగా ప్రకటించారు. 

 
జోన్ ఏర్పాటుపై సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సిద్ధం చేసేందుకు ప్రభుత్వం ఆ తర్వాత స్పెషల్ డ్యూటీపై అధికారిని నియమించింది. అనంతరం 2019 ఆగస్టులో ప్రభుత్వానికి డీపీఆర్‌ సమర్పించగా.. అప్పటి నుంచి ప్రతిపాదన దుమ్మురేపుతోంది. సుమారు 900 ఎకరాలు సిద్ధంగా వున్నట్లు తెలిపింది. మరి ఈ వార్షిక బడ్జెట్టులో విశాఖ రైల్వే జోన్ పైన నిధుల కేటాయింపు వుంటుందా.. వుండదా అనేది మరికాసేపట్లో తేలిపోనుంది.