సంబంధిత వార్తలు
- సొంతగడ్డపై తడబడిన సఫారీలు - 116 పరుగులకే కుప్పకూలిన సౌతాఫ్రికా
- భారత్ - సౌతాఫ్రికా జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం - సఫారీల తడబాటు
- ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా.. రోహిత్ శర్మ ఏమన్నారు?
- భారత్లో ఆర్థిక మాంద్యం తప్పదా... రఘురాం రాజన్ ఏమంటున్నారు?
- శ్రీరామ భక్తులకు శుభవార్త.. 1000కిపైగా ప్రత్యేక రైళ్లు
భారత్లో మళ్లీ కరోనా కలకలం.. 335 కొత్తకేసులు.. ఐదుగురు మృతి
భారత్లో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. దేశ వ్యాప్తంగా ఆదివారం 335 కొత్త కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో ఐదుగురు కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,701గా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మృతుల్లో నలుగురు కేరళ వాసులు వున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్లో ఓ వ్యక్తి కరోనాతో మరణించారు.
దేశంలో మొత్తం 4.50 కోట్ల కరోనా కేసులు వెలుగుచూశాయి. జాతీయ సగటు రికవరీ రేటు 98.81 అంతేకాకుండా, ఇప్పటివరకూ 220.67 కోట్ల కోవిట్ టీకా డోసులు పంపిణీ చేశారు. కేరళలో ఇటీవల కొత్త కరోనా సబ్ వేరియంట్ జేఎన్.1 వెలుగు చూసిన సంగతి తెలిసిందే.
