సంబంధిత వార్తలు
- షవర్మా సైడ్ ఎఫెక్ట్స్, తింటే ఏం చేస్తుందో తెలుసా?
- ఆన్లైన్లో షవర్మా ఆర్డర్ చేసి తిన్నాడు.. అంతే తిరిగి రాని లోకాలకు..?
- యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తెకు పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా?
- జార్ఖండ్లో పానీపూరి ఆరగించి 50 మందికి అస్వస్థత - వీరిలో చిన్నారులు కూడా..
- త్రివిక్రమ్ కుమారుడి ఫోటో వైరల్.. డైరక్టర్ కాబోతున్నాడట!
వ్యసనాలకు బానిసైన కన్నబిడ్డను చంపేసిన తండ్రి..
ఏపీలోని నంద్యాల జిల్లాలోని వెలుగోడు పట్టణంలో ఓ దారుణం జరిగింది. దురలవాట్లకు బానిసైన కన్నబిడ్డను కన్నతండ్రి చంపేశాడు. గొంతుకు కండువా బిగించి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశాడు. ఈ పట్టణంలోని సీపీ నగర్కు చెందిన సిరివేరు రామకృష్ణ అనే వ్యక్తికి సిరివేరు శ్రీనివాసులు అనే కుమారుడు ఉన్నాడు. ఇతను చిన్న వయస్సు నుంచే అన్ని రకాల వ్యసనాలకు బానిసయ్యాడు. నిత్యం మద్యం సేవించి వచ్చి తన తండ్రితో గొడవపడసాగాడు. దీంతో కొడుకును పలుమార్లు మందలించి, సరిదిద్దే యత్నం చేశాడు. కానీ, అతనిలో ఎలాంటి మార్పురాలేదు. దీంతో తంర్డి విసిగిపోయాడు.
ఈ నేపథ్యంలో గురువారం రాత్రి కూడా శ్రీనివాసులు మద్యం సేవించి వచ్చి తండ్రితో గొడవపడ్డాడు. దీంతో విసిగిపోయిన తండ్రి కుమారుడిపై ఉన్న మమకారాన్ని చంపుకుని కండువాతో గొంతు బిగించాడు. దీంతో ఊపిరాడకపోవడంతో శ్రీనివాసులు ప్రాణాలు విడిచాడు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
