సంబంధిత వార్తలు
- సీబీఐ విచారణకు జగన్ ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోంది? : టీడీపీ
- సీబిఐ విచారణకు లోకేష్ ఎందుకు భయపడుతున్నాడు?: మంత్రి అనిల్ కుమార్ యాదవ్
- కరోనాతో మరణించినవారి అంత్యక్రియలకు ప్రభుత్వ సాయం
- రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు రెడీ
- కరోనా పేషంట్లకు నిస్వార్థ సేవలు ప్రశంసనీయం: ఎమ్మెల్యే చెవిరెడ్డి సమీక్ష
వివేకా హత్యకేసులో 8వ రోజు సిబిఐ విచారణ
కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఎనిమిదో రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది.
కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో సీబీఐ అధికారులు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు.
ఇవాళ పులివెందులకు చెందిన వైసీపీ కార్యకర్త కిరణ్, సునీల్ కుమార్ల తండ్రి కృష్ణయ్యను విచారిస్తున్నారు. ఈ హత్యకేసులో అనుమానితులుగా ఉన్న వివేకా మాజీ కారు డ్రైవర్ దస్తగిరి, ఆయన ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్గా పని చేసిన ఇనాయతుల్లాతో పాటు కిరణ్, సునీల్లను సీబీఐ అధికారులు ఇప్పటికే పలుమార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే.
సునీల్ కుమార్ వివేకాకు అత్యంత సన్నిహితుడిగా ఉండేవాడని పులివెందులలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట సీబీఐ అధికారులు పులివెందులోని అతడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. దీంతో పాటు ఆదివారం వివేకా ఇంటిని కూడా మూడు గంటల పాటు అధికారులు పరిశీలించారు.
