సంబంధిత వార్తలు
- మా అమ్మకు గుండెపోటు.. విచారణకు రాలేను.. : సీబీఐకు అవినాష్ సమాచారం
- నేడు సీబీఐ ఎదుట వైకాపా ఎంపీ అవినాశ్ రెడ్డి - అరెస్టు తప్పదా?
- అవినాష్ విజ్ఞప్తికి సీబీఐ సానుకూల స్పందన.. కానీ శుక్రవారం...
- వివేకా హత్య కేసు : సీఎం జగన్ తమ్ముడు, కడప ఎంపీ అవినాష్కు సీబీఐ పిలుపు
- సీబీఐ నూతన డైరెక్టర్గా ప్రవీణ్ సూద్ - ప్రస్తుతం కర్నాటక డీజీపీగా విధులు
ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల్లో ఈ నెల 22న విచారణకు రావాలని పేర్కొంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు ఇప్పటికే రెండుసార్లు విచారించారు.
ఇటీవల మరోమారు నోటీసులు జారీ చేసింది. ముందస్తు అపాయింట్మెంట్లు ఉండడంతో విచారణకు రాలేనని సీబీఐ అధికారులకు ఎంపీ లేఖ రాశారు. నాలుగు రోజులు గడువు ఇవ్వాలని అధికారులను కోరారు. అవినాశ్ రెడ్డి తల్లికి అనారోగ్యానికి గురవడంతో శుక్రవారం ఆమెను ఆసుపత్రికి తరలించారు.
దీంతో శుక్రవారం కూడా అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకాలేకపోయారు. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు శనివారం మరోమారు నోటీసులు జారీ చేశారు.
తర్వాతి కథనం
