ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 31 డిశెంబరు 2020 (20:02 IST)

సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లో సగం ఛార్జీ అదనం: ఏపీఎస్‌ఆర్టీసీ

‘ఏపీ, తెలంగాణ ఆర్టీసీలు నిత్యం మరో 48 వేల కి.మీ. మేర సర్వీసులు నడిపేలా చర్చలు జరిపేందుకు తెలంగాణ ఆర్టీసీ ఎండీకి లేఖ రాసినట్లు ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ఎంటీ కృష్ణబాబు వెల్లడించారు.

ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. ‘కరోనా వల్ల ఇప్పటి వరకు సంస్థ రూ.2,603 కోట్ల మేర రాబడి కోల్పోయింది. ఈ ఏడాది సగటు ఓఆర్‌ 59.14 శాతమే ఉంది. డిసెంబరులో ఓఆర్‌ 70.74 శాతానికి పెరిగింది. మార్చినాటికి సాధారణ పరిస్థితి వస్తుంది...’ అని వివరించారు.

సంక్రాంతి ప్రత్యేక సర్వీసుల్లో సగం ఛార్జీ అదనంగా ఉంటుందని పేర్కొన్నారు.

* 5,586 మంది ఉద్యోగులు కొవిడ్‌ బారిన పడగా.. 91 మంది మరణించారు. వీరికి కేంద్రం ప్రకటించిన రూ.50లక్షల పరిహారం ఇవ్వాలని ప్రతిపాదన పంపాం.

* ఉద్యోగులు ప్రజారవాణాశాఖలో విలీనమైనప్పటికీ, కేడర్ల కేటాయింపు, పేస్కేల్‌ ఖరారు కోసం వివరాలు పీఆర్సీకి అందజేశాం.