సంబంధిత వార్తలు
- ఇన్స్టాగ్రామ్ ప్రేమ.. ఐదు లక్షలు కట్నంగా తెమ్మన్నాడు.. ఎలుకల మందు తాగి?
- Ayyanna: వైఎస్సార్సీపీ నేతల వైఖరికి సర్వత్రా విమర్శలు - అయ్యన్నకు అండగా పబ్లిక్
- ఆత్మహత్య చేసుకునేందుకు కారులో వెళ్తున్న కుటుంబం, వెంటాడిన పోలీసులు, ఏమైంది?
- నిమ్మ ధరలకు రెక్కలొచ్చాయి.. రూ.10వేలతో ఆల్ టైమ్ రికార్డ్
- MAVIGUN: అమరావతి సుదూర, అధిక నష్టభయం ఉన్న గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టు
ఒకవైపు ఎండలు.. మరోవైపు పిడుగులు.. అలెర్ట్
ఏపీలో ఒకవైపు ఎండలు మండిపోతుంటే.. మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం వుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర, పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉండటమే ఇందుకు కారణమని సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
పిడుగుల ప్రమాదం ఉన్నందున ప్రజలు చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని, రైతులు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మరోవైపు, రాష్ట్రంలోని 17 మండలాల్లో తీవ్ర వడగాలులు, 32 మండలాల్లో సాధారణ వడగాలులు వీస్తాయని హెచ్చరించారు.
శనివారం నాడు నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధికంగా 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నేపథ్యంలో ఎండల తీవ్రత నుంచి ప్రజలు తమను తాము కాపాడుకోవాలని ప్రఖర్ జైన్ సూచించారు.
