1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 ఫిబ్రవరి 2022 (15:06 IST)

బెజవాడకు పాకిన హిజాబ్ వివాదం - లయోలా కాలేజీలో...

కర్నాటక రాష్ట్రంలో మొదలైన హిజాబ్ వివాదం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలోకి వెళ్లడంతో కాస్తంత సద్దుమణిగింది. ఈ నేపథ్యంలో ఈ వివాదం ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడకు చేరుకుంది. స్థానిక లయోలా కాలేజీలో హిజాబ్ ధరించిన ముస్లిం విద్యార్థినులను కాలేజీ యాజమాన్యంలోనికి అనుమతించలేదు. 
 
దీనికి ఆ విద్యార్థులు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు. తామంతా మొదటి సంవత్సరం నుంచి హిజాబ్ ధరించే తరగతులకు హాజరవుతున్నామని, ఇపుడు కొత్తగా తమను అడ్డుకోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. 
 
ఈ వ్యవహారం బయటకుపొక్కడంతో టీవీల్లో వార్తలు వచ్చాయి. దీంతో ఈ కాలేజీ వద్దకు భారీ సంఖ్యలో ముస్లిం ప్రజలు చేరుకుంటున్నారు. దీంతో కాలేజీ వద్ద పోలీసు బందోబస్తు కల్పించారు. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా బెజవాడ లయోలా కాలేజీలో హిజాబ్‌ ధరించడాన్ని ఎందుకు వివాదం చేస్తున్నారని విద్యార్థినులు ప్రశ్నిస్తున్నారు.