1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Miscreants hurl eggs at Nara Lokesh during padayatra

యువగళం పాదయాత్ర.. నారా లోకేష్‌పై కోడిగుడ్లు విసిరిన ఆగంతకులు

nara lokesh
వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో చేదు సంఘటన ఎదురైంది. 
 
కొందరు వ్యక్తులు లోకేష్‌పై కోడిగుడ్లు విసిరి ఉద్రిక్తత, ఆందోళనకు కారణమయ్యారు. టీడీపీ సభ్యులు వెంటనే నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
 
ముందుజాగ్రత్త చర్యగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రొద్దుటూరులోని రిలయన్స్ పెట్రోల్ బంకు వద్ద జరిగిన దాడిలో లోకేష్‌పై ఇద్దరు యువకులు కోడిగుడ్లు, రాళ్లు విసిరారు. ఇది షాకింగ్ సంఘటనకు దారితీసింది. 
 
యువకుల చర్యలతో ఆగ్రహించిన టీడీపీ కార్యకర్తలు వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
తర్వాతి కథనం
ఏఐతో భారతీయుల్లో కొత్త టెన్షన్.. ఏంటది?