సంబంధిత వార్తలు
- ఆర్కిటిక్ లాజిస్టిక్స్ నెట్వర్క్లో రాణించేందుకు ఏపీ రెడీ.. నారా లోకేష్
- భారత్-రష్యా మధ్య ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేయాలి.. నారా లోకేష్
- భారతదేశంలో డేటా సెంటర్లపై విమర్శలు.. ఖండించిన నారా లోకేష్
- 2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు.. నారా లోకేష్ (video)
- జగన్పై నిప్పులు చెరిగిన నారా లోకేష్- రాయలసీమను ఉద్యానవన హబ్గా తీర్చిదిద్దుతాం..
గోదావరి పుష్కర ఘాట్కు దేవాన్ష్ పేరా? మంత్రి నారా లోకేశ్ ఫైర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే యేడాది గోదావరి పుష్కరాలు జరుగనున్నాయి. ఇందుకోసం ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నారు. ఈ పుష్కరాల ఏర్పాట్ల బాధ్యతను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వీకరించారు. అయితే, ఈ పుష్కరాల కోసం ఏర్పాటు చేస్తున్న ఓ ఘాట్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు నారా దేవాన్ష్ పేరు పెట్టడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ విషయంపై ఐటీ, మానవవనరుల శాఖామంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. ఇది చాలా హాస్యాస్పదమని వ్యాఖ్యానిస్తూ, ఆ పేరును వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇలాంటివి తగవని ఆయన స్పష్టం చేశారు.
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం, మునికూడలిలో గోదావరి పుష్కరాల కోసం ఘాట్ను సిద్ధం చేస్తున్నారు. ఈ ఘాట్కు దేవాన్ష్ ఘాట్ అని పేరు పెట్టారు. ఇటీవల జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఈ ఘాట్ను పరిశీలించి, దీనిని మోడల్ గ్రామీణ పుష్కర ఘాట్గా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఈ ఘాట్ వద్ద దేవాన్ష్ పేరుతో ఉన్న బోర్డు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రభుత్వ కార్యక్రమానికి సీఎం కుటుంబ సభ్యుడి పేరు పెట్టడంపై నెటిజన్లు నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ వివాదం మంత్రి నారా లోకేశ్ దృష్టికి వెళ్లడంతో ఆయన తక్షణమే స్పందించారు. ఈ ఘాట్కు కూడా దేవాన్ష్ పేరు పెట్టకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చిన వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వంలో జవాబుదారీతనం, పారదర్శక ముఖ్యమని చెప్పకనే చెప్పారు.
తర్వాతి కథనం
