1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Pawan Wants Officials To Create Common Facility Centres For AP Artisans

చేతివృత్తుల వారికి కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు.. పవన్ కల్యాణ్

Pawan kalyan
సాంప్రదాయ చేతివృత్తుల వారి సమగ్ర అభివృద్ధి- సంక్షేమం కోసం చర్యలను వేగవంతం చేయాలని, ముఖ్యంగా వారికి కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేయడంపై దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. 
 
విజయవాడలో జరిగిన 'ఆంధ్రప్రదేశ్ హస్తకళల మహోత్సవం'లో ఆయన చేతివృత్తుల వారితో ముచ్చటించారు. రాష్ట్ర సాంప్రదాయ హస్తకళల వారసత్వాన్ని పరిరక్షించడంతో పాటు, వారి జీవనోపాధికి అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, వారి ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలను కల్పించడం జరుగుతుందని ఆయన పునరుద్ఘాటించారు.
 
పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో సవర గిరిజన కళాకారుల కోసం వీబీ-జీ రామ్ పథకం నిధులతో సీఎఫ్‌సీ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, ఇందుకోసం భూసేకరణ ప్రక్రియ పూర్తయిందని పవన్ కళ్యాణ్ తెలిపారు.
 
 మదనపల్లెలో బంజారా బ్యాగుల తయారీదారులు, అనంతపురం జిల్లా కురుగుంటలో అరటి పీచు  కళాకారులు, పెడనలో కలంకారీ కళాకారుల కోసం కూడా ఇలాంటి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి స్థలాలను గుర్తించారు. ప్రతిపాదనలకు ఆమోదం లభించిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. 
 
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో, సాంప్రదాయ చెక్క వస్తువుల తయారీదారుల కమ్యూనిటీ సెంటర్ మరమ్మతుల కోసం ఎంపీఎల్ఏడీఎస్ నిధుల నుండి రూ.12 లక్షలు కేటాయించారు. ఈ కమ్యూనిటీ సెంటర్‌లో కాంపౌండ్ వాల్, మరుగుదొడ్లు మరియు స్టోర్ రూమ్ వంటి సౌకర్యాలు ఉంటాయి.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
రీల్స్ చూస్తుండగా ఇంటర్నెట్ అంతరాయం - మనస్తాపంతో మహిళ ఆత్మహత్య