1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Today, AP CM YS Jagan Guntur District Tour

నేడు గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన

YS Jagan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి శుక్రవారం గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10.15 గంటలకు మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్‌ను ఆయన ప్రారంభిస్తారు. ఆ తర్వాత 11 గంటలకు తాడేపల్లి మండలం కొలనుకొండలో హరేకృష్ణ గోకుల క్షేత్ర నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. 
 
ఇస్కాన్ బెంగుళూరుకు చెందిన హరేకృష్ణ మూమెంట్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నిర్మాణం జరుగుతుంది. మొత్తం ఆరున్నర ఎకరాల స్థలంలో దీని నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌తోపాటు పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఇస్కాన్ బెంగుళూరు అధ్యక్షుడు మధుపండిట్ దాస్ ముఖ్య అతిథులుగా హాజరవుతారు. 
తర్వాతి కథనం
బ్రెజిల్‌లో భారీ వరదలు - 94 మంది మృత్యువాత