ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 మార్చి 2022 (11:22 IST)

చిత్తూరు జిల్లా బస్సు ప్రమాద మృతులకు ఎక్స్‌గ్రేషియా

చిత్తూరు జిల్లా భాకరాపేటలో శనివారం రాత్రి ఓ ప్రైవేటు బస్సు ఒకటి 60 అడుగుల లోతులోపడిన ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  రూ.2 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున ఆర్థిక అందజేయనున్నట్టు తెలిపారు. 
 
సహాయక చర్యలను వేగవంతం చేయాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే, జిల్లా అధికారులతో ఆయన మాట్లాడారు. 
 
కాగా, ఈ ప్రమాదంలో గాయపడిన వారిని తిరుపతిలోని స్విమ్స్, రుయా, బర్డ్ ఆస్పత్రుల్లో చేర్చించి చికిత్స అందిస్తున్నట్టు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.2 లక్షలు చొప్పున ఆర్థిక సాయం చేయాలని సీఎం జగన్ చెప్పారని తెలిపారు. 

 
చిత్తూరులో దారుణం  
చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. నిశ్చితార్థం కోసం ధర్మవరం నుంచి తిరుచానూరుకు బయలుదేరిన బస్సు ఒకటి లోయలోపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృత్యువాతపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 63 మంది ఉన్నారు. ఈ ప్రమాదం జిల్లాలోని భాకరాపేట ఘాట్‌ రోడ్డు సమీపంలో మూల మలుపు తిరిగే సమయంలో అదుపుతప్పి 60 అడుగుల లోతులో పడిపోయింది. 
 
అనంతపురం జిల్లా ధర్మవరంలోని రాజేంద్ర నగర్‌కు చెందిన వేణుకు చిత్తూరు జిల్లా నారాయణవనం ప్రాంతానికి చెందిన ఓ యువతితో వివాం నిశ్చియమైంది. దీంతో ఆదివారం ఉదయం తిరుచానూరులో నిశ్చితార్థం జరగాల్సివుంది. ఇందుకోసం వేణు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ధర్మవరం నుంచి ఓ ప్రైవేటు బస్సులో మొత్తం 63 మందితో తిరుచానూరుకు బయలుదేరారు. 
 
రాత్రి 8 గంటల సమయంలో పీలేరులోని ఓ డాబా వద్ద ఆగి అందరూ భోజనాలు చేసి తిరిగి బయలుదేరారు. అక్కడ నుంచి సరిగ్గా 9 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత భాకరాపేట ఘాట్ రోడ్డు వస్తుండగా, దొనకోటి గంగమ్మ గుడి దాటిన తర్వాత మూల మలుపు పద్ద బస్సు అదుపు తప్పి 60 అడుగుల లోతోపడిపోయింది. 
 
ఈ ఘటనలో ఘటనా స్థలంలోనే ఆరుగురు ప్రాణాలు కోల్పోగా ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఇంకొందరి కాళ్లు, చేతులు విరిగాయి. కొందరికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో 8 మంది చిన్నారులు వృద్ధులు కూడా ఉన్నారు. 
 
ఈ ప్రమాదం రాత్రి పది గంటల సమయంలో జరగడంతో ఈ విషయం వెలుగులోకి రాలేదు. బాధితుల రోదనలు విన్న కొందరు వాహనదారులు ఆగి లోయలోకి చూడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు లోయలో చిక్కుకునిపోయిన వారిని రక్షించారు. క్షతగాత్రులను రుయా ఆస్పత్రికి తరలించారు.