శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : సోమవారం, 19 నవంబరు 2018 (14:07 IST)

పరగడుపున పచ్చి కరివేపాకులు నమిలి తింటే...

కరివేపాకు లేనిదే ఏ కూర చేయరు. అంటే భారతీయ వంటల తయారీలో కరివేపాకుకు అంత స్థానం ఉందన్నమాట. అలాంటి కరివేపాకును కొందరు ఇష్టంగా ఆరగిస్తే మరికొందరు మాత్రం ఆకు కదా అని తీసిపారేస్తారు. నిజానికి కరివేపాకులో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే ఏ ఒక్కరూ కూడా దాన్ని తీసిపడేయరు. అలాంటి కరివేపాకులో ఉన్న ఔషధ గుణాలు ఏంటో పరిశీలిద్ధాం. 
 
* ప్రతిరోజూ ఉదయాన్ని పరగడుపున 5 లేదా 10 కరివేపాకులను అలానే పచ్చివి నమిలి మింగాలి. ఇలా చేయడం వల్ల మధుమేహం అదుపులోకి వస్తుంది. ముఖ్యంగా రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. 
 
* కరివేపాకు పొడితో అన్నం ఆరగిస్తే అజీర్తి తగ్గిపోతుంది. పైగా, ఆకలి పెరుగుతుంది. తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అయితే, కరివేపాకులకు మెంతులు, మిరియాలు కూడా కలిపి పొడి చేసుకుంటే ఇంకా మంచిది. 
 
* కరివేపాకులో అనేక పోషకాలు ఉన్నాయి. కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, ఆంటీయాక్సిడెంట్స్, కెరోటిన్, ప్రొటీన్స్, కొవ్వు పదార్థాలతో పాటు.. పిండిపదార్థాలు, ఫైబర్, మినరల్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల నిత్యం కరివేపాకును ఆరగించడం వల్ల పైన చెప్పిన పోషకాలన్నీ శరీరానికి లభ్యమవుతాయి. 
 
* మజ్జిగలో కరివేపాకు ఆకుల రసం కలిపి తీసుకుంటే విరేచనాలు తగ్గుతాయి. కొబ్బరినూనెలో కొద్దిగా కరివేపాకు పేస్ట్ వేసి బాగా మరగబెట్టి అనంతరం వచ్చే ద్రవాన్ని వడబోసి వెంట్రుకలకు రాసుకుంటే వెంట్రుకలు నిగనిగలాడుతాయి. జట్టు సమస్యలూ తొలగిపోతాయి.