1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. 2000 rs note exchange: Pink notes worth Rs 9,330 crore to be returned

ఆర్బీఐ పింక్ నోట్ల రద్దు... 97.38 శాతం ఓట్లే తిరిగొచ్చాయ్

currency notes
2000 రూపాయల నోట్లు పూర్తిగా బ్యాంకులకు తిరిగి రాలేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎనిమిది నెలల క్రితం 2000 నోట్లను రద్దు చేసింది. ఆర్బీఐ రద్దు తర్వాత 97.38 శాతం నోట్లు మాత్రమే తిరిగి వచ్చాయి. 
 
ఆర్బీఐ డేటా ప్రకారం, ప్రజలు ఇప్పటికీ 9,330 కోట్ల రూపాయల నోట్లను కలిగి ఉన్నారు. అక్టోబర్ 7, 2023 వరకు బ్యాంకుల్లో ఈ నోట్లను రీడీమ్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ సదుపాయం ఇప్పటికీ RBI కార్యాలయాల్లో అందుబాటులో ఉంది. 
 
ప్రజలు తమకు సమీపంలోని ఏదైనా పోస్టాఫీసు ద్వారా రూ.2000 నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. గతేడాది మే 19న మార్కెట్‌లో మొత్తం రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు చలామణిలో ఉన్నాయి. డిసెంబర్ 29, 2023 నాటికి రూ.9,330 కోట్లకు తగ్గింది. 
 
దీని ప్రకారం డిసెంబర్ చివరి వరకు 2.62 శాతం పింక్ నోట్లు చలామణిలో ఉన్నాయి. 97.38 శాతం నోట్లు బ్యాంకులకు చేరాయి. క్లీన్ నోట్ పాలసీ కింద 19 మే 2023న దేశంలో చలామణిలో ఉన్న అత్యధిక విలువ కలిగిన రూ.2,000 నోటును ఉపసంహరించుకోనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
గ్రేటర్ నోయిడాలో దారుణం.. మహిళపై సామూహిక అత్యాచారం..