సంబంధిత వార్తలు
చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి... కిలో ధర రూ.300
చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. ధరల పెరుగుదల కారణంగా సామాన్య ప్రజలు చికెన్ కొనాలంటేనే ఆలోచిస్తున్నారు. చికెన్ ధరలు పెరగడానికి ప్రధానంగా ఎండల ప్రభావం, ఫారమ్లలో ఉత్పత్తి తగ్గడం కారణం అవుతున్నాయి. డిమాండ్ పెరగడం ఇతర కారణాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు కిలో 300 రూపాయల స్థాయికి చేరుకున్నాయి.
ముఖ్యంగా హైదరాబాద్, ఖమ్మం వంటి నగరాల్లో స్కిన్లెస్ చికెన్ కిలో 280 నుండి 300 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నం, అమలాపురం, భీమవరం వంటి ప్రాంతాల్లో కూడా 280 రూపాయల వరకు ధర నమోదైంది. కామారెడ్డిలో 280, వరంగల్లో 270, గుంటూరులో 250 నుండి 270 రూపాయల మధ్య చికెన్ అందుబాటులో ఉంది.
