సంబంధిత వార్తలు
- కరోనా వైరస్ను పారదోలటం ఇప్పట్లో జరిగే పనికాదు.. ఆర్బీఐ మాజీ గవర్నర్
- విజయ్ మాల్యా పట్ల ఆర్బీఐ గిఫ్ట్ : రూ.1,915 కోట్ల రుణాలు రద్దు
- చైనాలో మరో వుహాన్ ... వణికిస్తున్న హర్బిన్ ... డజన్ల కొద్దీ కేసులు
- ముగిసిన ఆంధ్రా బ్యాంకు అధ్యాయం ... యూనియన్ బ్యాంకుగా అవతరణ
- కరోనావైరస్: ఆర్బీఐ నిర్ణయాలతో మీ ఈఎమ్ఐపై పడే ప్రభావం ఏంటో తెలుసా?
లాక్ డౌన్ ఎఫెక్ట్.. మరో మూడు నెలల పాటు మారటోరియం పొడిగింపు?
కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో ఆర్బీఐ ప్రజలకు, పరిశ్రమలకు చేయూత కోసం మారటోరియాన్ని మరో మూడు నెలలు పొడిగించే అంశంపై పరిశీలిస్తోంది. లాక్ డౌన్ కారణంగా డబ్బుల్లేక ప్రజలు, పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ.. తీసుకున్న రుణాలు కట్టేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మారటోరియాన్ని మూడు నెలల పాటు పొడిగించడంపై పరిశీలన జరుగుతోంది.
కాగా దేశ వ్యాప్తంగా మే 17 వరకు లాక్ డౌన్ పొడిగింపు అంటే 54 రోజుల పాటు ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా నిలిచిపోయాయి. వ్యాపారాలు లేక వ్యాపారులు, ఉద్యోగుల చేతిల్లో డబ్బులు లేవు. లాక్ డౌన్ మళ్లీ పొడిగిస్తారా లేదా కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో మారటోరియాన్ని పొడిగిస్తే ప్రజలకు కాస్త ఊరటనిచ్చినట్లు అవుతుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
