సంబంధిత వార్తలు
- కోర్టుకు రాకూడదు.. అందుకే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సాకు.. హైకోర్టు ఆగ్రహం
- జీఎస్టీ అమలుతో శ్రీవారి లడ్డూ ధర అప్.. గదులు, దర్శనటిక్కెట్లు కూడా..
- అరుణ్ జైట్లీ బడ్జెట్ 2017, IRCTC బుకింగ్లో ఇకపై నో సర్వీస్ చార్జెస్
- మీ బామ్మర్ధికో న్యాయం.. నాకో న్యాయమా? చంద్రబాబుపై 'రుద్రమదేవి' గుణశేఖర్ డైరక్ట్ అటాక్
- మనీలాండరింగ్ కేసులో విజయ్ మాల్యా అరెస్టు
రైలు టిక్కెట్ల బుకింగ్స్పై సేవా రుసుం మినహాయింపు పొడిగింపు
గత యేడాది దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత 2016 నవంబర్లో ఆన్లైన్ రైల్వే టికెట్లపై సేవా రుసుమును కేంద్రం రద్దు చేసింది. నగదు రహిత లావాదేవీల ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సేవా రుసుమును ఎత్తివేశారు.
గత యేడాది దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత 2016 నవంబర్లో ఆన్లైన్ రైల్వే టికెట్లపై సేవా రుసుమును కేంద్రం రద్దు చేసింది. నగదు రహిత లావాదేవీల ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సేవా రుసుమును ఎత్తివేశారు. తాజాగా దీన్ని వచ్చే ఏడాది మార్చి వరకు సేవా రుసుం లేకుండానే టికెట్ బుక్ చేసుకునే సౌలభ్యం కల్పించారు. వచ్చే ఏడాది మార్చి 2018 వరకు సేవా రుసుము లేకుండానే టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
సేవా రుసుము వల్ల టికెట్పై రూ.20 నుంచి, రూ.40 మేర వినియోగదారులకు లబ్ధి చేకూరుతోంది. ఐఆర్సీటీసీకి వచ్చే ఆదాయం 33 శాతం సేవా రుసుముల నుంచే వస్తోంది. గతేడాది ఐఆర్సీటీసీకి వచ్చిన మొత్తం ఆదాయంలో కేవలం సేవా రుసుము ద్వారానే రూ.540 కోట్లు రావడం గమనార్హం. ఈ సేవా రుసుం రద్దు తర్వాత రూ.184 కోట్ల మేర ఐఆర్సీటీసీకి ఆదాయం తగ్గింది.
తర్వాతి కథనం
