1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
  4. TS DOST 2021 notification, application form expected soon for Telangana UG Admissions

కరోనా కాలంలో దోస్త్ డిగ్రీ ఆన్‌లైన్ అడ్మిషన్లు: నోటిఫికేషన్ విడుదల

TS DOST 2021 notification
కరోనా కాలంలో దోస్త్ డిగ్రీ ఆన్‌లైన్ అడ్మిషన్లు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. జులై ఒకటి నుండి డిగ్రీ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్- రిజిస్ట్రేషన్స్ ప్రారంభం కానుండగా… సెప్టెంబర్ ఒకటి నుండి మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి.
 
జులై 1 నుండి 15 వ తేదీ వరకు మొదటి ఫేస్ రిజిస్ట్రేషన్స్ మొదలు కానుండగా.. జులై 3 నుండి 16 వరకు వెబ్ ఆప్షన్స్ ప్రారంభం కానున్నాయి. అలాగే జులై 22 న మొదటి విడత సీట్ల కేటాయింపు జరుగనుంది. సీటు వచ్చిన విద్యార్థులు 27 వ తేదీ వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
 
రెండో విడత రిజిస్ట్రేషన్స్ 400 రూపాయల ఫీజుతో జులై 23 నుండి 27 వరకు.. అలాగే జులై 24 నుండి 28 వరకు రెండో విడత వెబ్ ఆప్షన్స్ ఉండనున్నాయి. ఆగస్ట్ 4 న సీట్ల కేటాయింపు జరుగనుంది. 
 
ఆగస్ట్ 5 నుండి 10 వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉండగా… మూడో విడత ఆగస్ట్ 5 నుండి 10 వరకు రిజిస్ట్రేషన్స్ ప్రారంభం కానున్నాయి. ఆగస్ట్ 18 న సీట్ల కేటాయింపు జరుగనుంది. ఆగస్ట్ 18 నుండి 21 వరకు అన్ని విడతల్లో సీట్లు పొందిన విద్యార్ధులు ఆయా కళాశాలల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సెప్టెంబర్ ఒకటి నుండి తరగతులు ప్రారంభం కానున్నాయి.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
మా చెల్లి పెళ్లి... జరగాలి మళ్లీ మళ్లీ : సీఎం జగన్‌కు మరో లేఖ