సంబంధిత వార్తలు
- ఆనందయ్య మందు పంపిణీకి సహకరించని ప్రభుత్వం...
- స్ఫూర్తిదాయక నేత అంటూ చిరు ప్రశంసలు - ధన్యవాదాలు తెలిపిన సీఎం జగన్
- భారత్లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. 24 గంటల్లో 50వేల కేసులు
- ఆంధ్రా ప్రజలను అనలేదు.. ఆంధ్రా పాలకలను అన్నాను... మంత్రి వేముల
- ఆంధ్రప్రదేశ్ సభ్యుల జీవితాలకు విలువ చేర్చే అమేజాన్ ప్రైమ్ వారి విస్తృత శ్రేణి ప్రయోజనాల కొనసాగింపు
ఏపీలో 5 వేలకు దిగువకు కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయి. మొత్తం కేసులు 5 వేలకు దిగువకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో 4,684 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
తూర్పుగోదావరి జిల్లాలో 1,171 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 73 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదేసమయంలో 36 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. 24 గంటల్లో 7,324 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
తాజా కేసులతో కలిపి రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 18,62,036కి పెరిగింది. ఇప్పటి వరకు 17,98,380 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 51,204 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 12,452 మంది ప్రాణాలు కోల్పోయారు.
