1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 ఆగస్టు 2021 (10:31 IST)

దేశంలో ఈ రోజు కరోనా పాజిటివ్ కేసులెన్ని?

దేశంలో కొత్తగా మరో 42909 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,27,37,939కి చేరింది. అలాగే, గడిచిన 24 గంటల్లో 34,763 మంది కోలుకున్నార‌ని పేర్కొంది. 
 
మరోవైపు, దేశంలో క‌రోనాతో మ‌రో 380 మంది మృతి చెందారు. ఈ మృతుల సంఖ్యతో కలుపుకుంటే మొత్తం మృతుల సంఖ్య 4,38,210కి పెరిగింది. క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,19,23,405 మంది కోలుకున్నారు. 
 
3,76,324 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. 63.43 కోట్ల‌ డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. నిన్న ఒక్క‌ కేర‌ళ‌లోనే 29,836 కేసులు న‌మోదు కాగా, 75 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
మరోవైపు, రాష్ట్రంలో ఆదివారం 58,335 కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, 257 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో కేసుల సంఖ్య మొత్తం 6.57 లక్షలకు చేరింది. వైర్‌సతో మరొకరు మృత్యువాత పడటంతో మరణాల సంఖ్య మొత్తం 3,870కు పెరిగింది. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో 5,912 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 1,15,650 మంది తొలిడోసు వ్యాక్సిన్‌ తీసుకున్నారు. దీంతో ఆ సంఖ్య మొత్తం 1.31 కోట్లకు చేరింది. మరో 60 వేల మంది రెండో డోసు తీసుకోవడంతో ఆ డోసు తీసుకున్న వారి సంఖ్య మొత్తం 45 లక్షలకు పెరిగింది.