శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 మార్చి 2021 (10:55 IST)

మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు... తెలంగాణాలో తాజా పరిస్థితి...

దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మంగళవారం కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ మేరకు.. దేశంలో గత 24 గంటల్లో 12,286 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదేస‌మ‌యంలో 12,464 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,24,527కు చేరింది.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 91 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,57,248కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,07,98,921 మంది కోలుకున్నారు. 1,68,358 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 1,48,54,136 మందికి వ్యాక్సిన్ వేశారు.
     
కాగా, దేశంలో సోమవారం వరకు మొత్తం 21,76,18,057 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,59,283 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
ఇదిలావుంటే, తెలంగాణలో కొత్త‌గా 163 కరోనా కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ లెక్కల ప్రకారం, గత 24 గంటల్లో కరోనాతో ఒక‌రు ప్రాణాలు కోల్పోయారు. అదేసమయంలో 157 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,99,086కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,95,544 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1635 గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,907 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 774 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు.