1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 మే 2022 (11:27 IST)

ఇకపై కోవిడ్ మాత్రలు - ఇంజెక్షన్ కంటే మెరుగైన ఫలితం

corona tablet
ప్రపంచాన్ని కరోనా వైరస్ ఓ వైరస్ ఓ కుదుపు కుదిపేసింది. ప్రతి ఒక్కరి జీవితాలు తారుమారయ్యాయి. ఈ మహమ్మారి ధాటికి అనేక మంది బాధితులు మృత్యువాతపడ్డారు. కోట్లాది మంది ఈ వైరస్ బారినపడ్డారు. అనేక మంది కోలుకోగా మరికొందరు చనిపోయారు. అయితే, ఈ వైరస్‌ను సరైన మందును కనుగొనే పనిలో శాస్త్రవేత్తలు ఉన్నారు. ప్రస్తుతం ఈ వైరస్ నుంచి కొంతమేరకు రక్షించేలా వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కానీ, ఈ వైరస్ నుంచి ప్రాణాలను కాపాడే మందులు మాత్రం అందుబాటులో లేవు. 
 
ఈ నేపథ్యంలో మాత్రల రూపంలో కోవిడ్ వ్యాక్సిన్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనివల్ల కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని చెబుతున్నారు. కరోనా రోగుల నోటి నుంచి వెలువడే తుంపర్ల సంఖ్యను ఈ సరికొత్త టీకా గణనీయంగా తగ్గిస్తుందని తమ అధ్యయనంలో తేలినట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. 
 
అడినోవైరస్‌ను వాహకంగా ఉపయోగించుకునేలా అభివృద్ధి చేసిన ఈ టీకాను నోటి ద్వారా తీసుకోవచ్చిని అమెరికాలోని డ్యూక్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ పరిశోధకులు వెల్లడించారు. రక్తంలోనూ, ఊపిరితిత్తుల్లోనూ ఇది యాంటీబాడీలను సమర్థంగా తయారు చేస్తుందని తెలిపారు. ఫలితంగా కరోనా వైరస్ నుంచి అది రక్షణ కల్పిస్తుందని వివరించారు.