1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 జులై 2022 (10:32 IST)

దేశంలో కొత్తగా 16 వేల కరోనా పాజిటివ్ కేసులు

coronavirus
దేశంలో కొత్తగా మరో 16,678 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,36,39,329కు చేరుకుంది. ఇందులో 4,29,83,162 మంది బాధితులు కోలుకున్నారు. 
 
ఇప్పటివరకు 5,25,428 మంది మరణించారు. పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో యాక్టివ్ కేసులు 1,30,713కు పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 26 మంది వైరస్‌కు చనిపోగా, 14,629 మంది డిశ్చార్జ్ అయ్యారు. 
 
ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 5.99 శాతానికి పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం కేసుల్లో 0.30 శాతం కేసులు యాక్టివ్‌లు ఉన్నాయని తెలిపింది. రికవరీ 98.50 శాతంగా ఉండగా, మరణాలు 1.20 శాతంగా ఉన్నాయని వెల్లడించింది.