1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Today Media Bullitin on Covid Positive Cases

దేశంలో మరో 26 వేల కరోనా పాజిటివ్ కేసులు

Media bullitin
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 26115 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 3,35,04,534కి చేరింది. 
 
అదేవిధంగా మరో 34,469 మంది కోలుకున్నార‌ని పేర్కొంది. దేశంలో క‌రోనాతో మ‌రో 252 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,45,385కి పెరిగింది. ఇక క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,27,49,574 మంది కోలుకున్నారు. 
 
ప్ర‌స్తుతం 3,09,575 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 96,46,778 వ్యాక్సిన్ డోసుల‌ను ప్ర‌జ‌ల‌కు వేశారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 81,85,13,827 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
దాంపత్య మనస్పర్థలు: పారామెడికల్ విద్యార్థిని ఆత్మహత్య