సంబంధిత వార్తలు
- ప్రఖ్యాత బాంబే చెఫ్ను కాటేసిన కరోనా... అమెరికాలో విషాదం
- కరోనాపై పోరాటం.. భారత్కు సాయం చేసేందుకు సిద్ధం.. చైనా
- జర్నలిస్టులూ జరజాగ్రత్త... సీఎం ప్రెస్మీట్కెళ్లిన విలేకరికి కరోనా
- పవర్ స్టార్ పెద్ద మనసు : తెలుగు రాష్ట్రాలకు రూ.కోటి - కేంద్రానికి రూ.కోటి
- మూడేళ్ళ బాలుడిని కాటేసిన కరోనా.. తెలంగాణాలో 41కి చేరిన కేసులు
స్విజ్ మాస్టర్ అదుర్స్.. కరోనా కంట్రోల్కు రూ.7.75కోట్ల సాయం
స్విజ్ మాస్టర్, టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ కరోనా నియంత్రణ కోసం తన వంతు సాయంగా రూ.7.75 కోట్ల విరాళం ప్రకటించాడు. తన భార్య మిర్కా, తాను వ్యక్తిగతంగా ఈ మొత్తాన్ని విరాళంగా ఇస్తున్నట్టు ఫెదరర్ ప్రకటించాడు. కోవిడ్-19 ఇప్పుడు అందరికీ సవాలుగా మారిందని, ఎవరూ తప్పించుకోవడానికి వీల్లేకుండా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు.
కాగా, స్విట్జర్లాండ్లోనూ కరోనా వైరస్ తన ప్రభావాన్ని చూపిస్తోంది. బుధవారం రాత్రి నాటికి అక్కడ మృతి చెందిన వారి సంఖ్య 86కు చేరుకుంది. కరోనా కేసులు ఎక్కువగా నమోదైన టాప్-10 దేశాల్లో స్విట్జర్లాండ్ కూడా ఉంది. ఇప్పటి వరకు 8,800 కరోనా నిర్ధారిత కేసులు నమోదయ్యాయి.
ఇకపోతే.. స్పెయిన్లో కరోనా మరణాలు పెరుగుతున్నాయి. బుధవారం ఒక్క రోజే అక్కడ ఏకంగా 738 మందిని కరోనా బలితీసుకున్నట్టు స్థానిక పత్రికలు తెలిపాయి. స్పెయిన్లో ప్రస్తుత పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మరణాల్లో ఆ దేశం చైనాను దాటిపోయింది.
చైనాలో 3,285 మంది మాత్రమే మరణించగా, స్పెయిన్లో ఏకంగా 3,434 మంది కరోనా కాటుకు బలయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 16 వేలు దాటిపోయింది. 4.40 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి.
తర్వాతి కథనం
