సంబంధిత వార్తలు
- ఏపీలో పల్లెవెలుగు బస్సుల్లోనూ ఏసీ, సీఎం చంద్రబాబు నిర్ణయం
- Amaravati: ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ
- విజయవాడ ఆవిధంగా ముందుకు పోతోంది, ఒక క్విక్ కామర్స్ యూజర్ 2025లో రూ.3.62 లక్షలకు పైగా ఖర్చు చేశారు
- మద్యం వినియోగం: అగ్రస్థానంలో తెలంగాణ - రూ.36,000 కోట్ల ఆదాయం
- మొన్న తిరుమల లడ్డూ, నిన్న పరకామణి, నేడు తిరుపతి గోవిందరాజ స్వామి 50 కిలోల బంగారం మాయం?!!
కుటుంబ కలహాలు : బావమరిదిని హత్య చేసిన బావ
ఏపీలోని వినుకొండ, శృంగారపువనంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా బావమరిదిని బావ కొట్టి చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... శృంగారపువనానికి చెందిన రాచకూటి షారోన్ (25) చెల్లెలు హెమీమీని ఆరేళ్ల క్రితం క్రోసూరు మండలం ఊటుకూరుకు చెందిన చిలకా గోపితో వివాహం జరిపించారు. వారికి ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు.
అయితే, గోపి చెడు వ్యసనాలకు అలవాటై తరచూ వేధిస్తున్నాడని హెమీమీ అప్పుడప్పుడు పుట్టింటికి వచ్చేది. గతంలో పెద్దలు రాజీ చేసి కాపురానికి పంపించారు. రెండు మూడు రోజుల తర్వాత గోపి మళ్లీ వేధించసాగాడు. దీంతో హెమీమీ మళ్ళీ పుట్టింటికి వచ్చింది. దీంతో గోపిపై హేమీమీ అన్న షారోన్ కోపం పెంచుకున్నాడు.
ఈ క్రమంలో బుధవారం గోపి, షారోన్ కలిసి మద్యం సేవించారు. మత్తులో ఇద్దరూ గొడవ పడ్డారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో గోపి చిన్న గ్యాస్ సిలెండర్తో షారోన్ తలపై కొట్టాడు. తీవ్ర గాయాలు కావడంతో బంధువులు వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
