1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 1 అక్టోబరు 2023 (12:46 IST)

బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం.. ఎక్కడ?

victim
ఏపీలోని కృష్ణా జిల్లాలో బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డారు. జిల్లాలోని కంకిపాడు మండలంలో ఈ ఘటన జరిగింది. ఇది శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు కంకిపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన 12 యేళ్ల బాలిక ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం తన ఇంటికి వెళ్ళేందుకు బస్టాండులో నిరీక్షిస్తుండగా అదే గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ కుంపటి చందు (22), అతని స్నేహితుడు 17తో కలిసి గ్రామానికి వెళుతున్నారు. 
 
బస్టాండులో బాలికను చూడటంతో తనను కూడా ఇంటివద్ద దింపాలని ఆ బాలిక కోరింది. దీంతో సరేనని చెప్పి బాలికను ఆటోలో ఎక్కించుకున్నారు. ఆ తర్వాత బాలికకు మాయమాటలు చెప్పి.. రొయ్యూరుకు తీసుకెళ్ళారు. అక్కడ చందు మద్యం సేవించి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పడంతో ఆమె శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి పోలీసులు... చందుతో అతనికి సహకరించిన మైనర్ బాలుడిని కూడా అరెస్టు చేశారు. కేసు విచారణ జరుపుతున్నారు.