సంబంధిత వార్తలు
- విడాకుల కోసం సొంత చెల్లినే ఎరగా వేసిన మహిళ ... భర్త రెండో భార్యగా చిత్రీకరించిన వైనం...
- ప్రియుడి భార్యను, పిల్లల్ని కత్తితో పొడిచి చంపిన మహిళ, కాళ్లు పట్టుకున్నా వదల్లేదు...
- పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.. కానీ ఇడ్లీ తిని ఓ బాలింత మృతి
- నీవంటే ఇష్టం లేదు.. నలుగురు ప్రియురాళ్లు ఉన్నారని చెప్పిన కాబోయే వరుడు.. ప్రాణాలు తీసుకున్న వధువు
- ప్రియుడి కోసం బంగారు నగలు తాకట్టు పెట్టి భర్త హత్యకు రూ. 5 లక్షలు అడ్వాన్స్
బహ్రెయిన్లో నరసాపురం యువతి ఆత్మహత్య
జీవనోపాధి కోసం బహ్రెయిన్ దేశానికి వెళ్లిన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరం వాసి వర్ధనపు కవిత (23) అక్కడ ఈ నెల 23న ఆత్మహత్యకు పాల్పడ్డారు. గ్రామానికి చెందిన కవిత తండ్రి గతంలోనే మృతి చెందగా తల్లి లూథియా ఉపాధి నిమిత్తం కొన్నేళ్లుగా కువైట్లో ఉంటున్నారు. కవిత, ఆమె ముగ్గురు అక్కలు చిట్టవరంలో పెదనాన్న ఇంట్లో ఉంటున్నారు. కుటుంబానికి ఆసరాగా నిలవాలనే యోచనతో కవిత తెలిసిన వారి ద్వారా నాలుగు నెలల కిందట బహ్రెయిన్ వెళ్లారు.
అక్కడ ఓ ఇంట్లో పనిలో చేరిన ఆమె ఈ నెల 23న గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనిపై ఆ ఇంటి యజమాని కువైట్లో ఉన్న ఆమె తల్లికి చరవాణి ద్వారా సందేశం పంపారు. దాని సారాంశం అర్థం కాకపోవడంతో ఆమె ఆ సందేశాన్ని ఇక్కడి బంధువులకు పంపగా విషయం వెలుగు చూసింది.
కవిత ఆత్మహత్యకు కారణాలు తెలియలేదని, దీనిపై తెలుగు సంఘాల ప్రతినిధులు అక్కడి అధికారులకు ఫిర్యాదు చేశారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కవిత మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని కోరుతూ ఆమె కుటుంబ సభ్యులు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మకు ఆదివారం వినతిపత్రం అందజేశారు.
