బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 అక్టోబరు 2022 (10:24 IST)

హస్తిలో బాణాసంచా పేల్చితే ఆర్నెల్ల జైలుశిక్ష

crackers
ఈ నెల 24వ తేదీన దేశ ప్రజలు దీపావళి పండుగను జరుపుకోనున్నారు. ఇందుకోసం వివిధ రకాల క్రాకర్స్ విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. దేశ ప్రజలంతా ఎంతో సంతోషంగా జరుపుకునే ఈ పండుగను ఢిల్లీ వాసులు మాత్రం ఎలాంటి శబ్దాలు చేయకుండానే జరుపుకోవాల్సివుంటుంది. ఢిల్లీ వ్యాప్తంగా బాణాసంచా పేల్చకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. 
 
ప్రభుత్వ ఉత్తర్వులు అతిక్రమిస్తే మాత్రం రూ.200 అపరాధం లేదా ఆర్నెల్ల జైలు శిక్ష లేదా రెండూ విధిస్తామని హెచ్చరించింది. ఇక్కడ విచిత్రమేమిటంటే టపాసులు కొనుగోలు చేసినా ఈ అపరాధం విధిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 
 
కాగా, హస్తిలో వాయుకాలుష్యంతో పాటు శబ్దకాలుష్యం విపరీతంగా పెరిగిపోయిన విషయం తెల్సిందే. దీంతో ఈ కాలుష్య నియంత్రణ కోసం ఢిల్లీ ప్రభుత్వం అనేక రకాలైన చర్యలు చేపడుతుంది. ముఖ్యంగా, దీపావళి సమయంలో కాల్చే మతలాబుల వల్ల వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెల్సిందే. దీంతో బాణాసంచా విక్రయాలు, వినియోగంపై నిషేధం విధించారు.