శుక్రవారం, 28 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 19 జూన్ 2023 (22:05 IST)

బాహుబలి సమోసా తింటే రూ.71వేల రివార్డు

Bahubali samosa
Bahubali samosa
బాహుబలి సమోసా తింటే రూ.71,000 రివార్డు ప్రకటించగా.. ఇప్పటివరకు ఆ సమోసా ఎవరూ తినలేకపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి.
 
గుజరాత్‌లోని సూరత్‌లోని ఒక హోటల్‌లో ఒక ప్రకటన కోసం 12 కిలోల బాహుబలి సమోసాను ప్రదర్శించారు. 30 నిమిషాల్లో ఈ సమోసా తిన్న వ్యక్తికి రూ.71 వేలు ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు రెస్టారెంట్ ప్రకటించింది.
 
ఈ పోటీలో ఇప్పటి వరకు ఎవరూ గెలవలేదని, ఒక్కరు మాత్రమే 25 నిమిషాల్లో తొమ్మిది కిలోల వరకు తిని, అంతకు మించి తినలేక పోటీ నుంచి తప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి. 
 
కస్టమర్లను ఆకర్షించేందుకు, ప్రకటనల కోసం రెస్టారెంట్ యాజమాన్యం ఈ వ్యూహాన్ని ఉపయోగిస్తుండగా చాలామంది ఈ సమోసా తినేందుకు ముందుకు రావడం గమనార్హం. అయితే ఇప్పటి వరకు ఎవరూ గెలవలేదు కాబట్టి ఇక నుంచి ఎవరైనా గెలుస్తారో లేదో చూడాలి.