మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 15 జూన్ 2018 (09:41 IST)

అమెరికా నుంచి భారత్‌కు కారులోనే వచ్చేశారు.. విమానం ఎక్కనేలేదు..

అమెరికా నుంచి భారత్‌కు రావాలంటే.. పాస్‌పోర్ట్, వీసా సిద్ధం చేసుకోవాలి. అయితే అమెరికాలో నివసిస్తున్న భారతీయ జంట మాత్రం అమెరికా నుంచి భారత్ వచ్చేందుకు విమానంలో ఎక్కకూడదని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే

అమెరికా నుంచి భారత్‌కు రావాలంటే.. పాస్‌పోర్ట్, వీసా సిద్ధం చేసుకోవాలి. అయితే అమెరికాలో నివసిస్తున్న భారతీయ జంట మాత్రం అమెరికా నుంచి భారత్ వచ్చేందుకు విమానంలో ఎక్కకూడదని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడువుగా భారత్ వెళ్లేందుకు రోడ్డుమార్గం ఎంచుకున్నారు.


విమానంలో వెళ్లేదానికంటే.. థ్రిల్ కోసం రాజేష్ కపాడియా, దర్శన్ అనే భారత జంట.. సొంత వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు. అందులో నిత్యావసర వస్తువులు సిలిండర్లు ఇలా అన్నీ సిద్ధం చేసుకుని హోం రన్‌ పేరుతో అమెరికా నుంచి యాత్రను ప్రారంభించారు. యాత్రలో ప్రతి కదలికలను తమ కుటుంబసభ్యులకు తెలిసేలా జీపీఎస్‌ సిస్టమ్‌ను వాహనానికి అనుసంధానం చేశారు. అంతే అమెరికా నుంచి భారత్‌కు చేరుకున్నారు. 
 
ఇండియాకు చేరే క్రమంలో చైనా మిలట్రీ విభాగం వీరి వాహనానికి అనుమతి ఇవ్వలేదు. దీంతో 17వేల కిలోమీటర్లు చుట్టూ తిరిగి చివరికి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ యాత్ర 61 రోజులు సాగిందని రాజేశ్‌, దర్శన్‌ల జంట వెల్లడించింది. 19 దేశాల్లో 37వేల కిలోమీటర్లు ప్రయాణించి భారత్‌కు చేరుకున్నట్లు ఆ జంట చెప్పుకొచ్చింది.