శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 21 ఏప్రియల్ 2019 (11:53 IST)

శ్రీలంకలో ఉగ్రదాడులు... 100 మందికి పైగా మృతి

శ్రీలంక రాజధాని కొలంబోని పలు ప్రాంతాల్లో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. కొలంబోలోని రెండు ప్రార్థనా మందిరాల్లో, హోటల్స్‌ను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు పేలుళ్లు జరిపారు. బాంబు పేలుళ్లలో దాదాపుగా 100 మందికి పైగా చనిపోగా, వందలాది మంది మృతి గాయపడినట్టు సమాచారం. క్షతగాత్రుల్లో 40 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, భద్రతా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాడు. పరిసర ప్రాంతాల్లోని భవనాలకు పగుళ్లు వచ్చాయి. 
 
తొలుత బట్టికలోవా ప్రాంతంలోని ఓ చర్చిలో పేలుడు సంభవించింది. ఆపై, హోటల్ షాంగ్రీలా, హోటల్ సినామోన్ గ్రాండ్‌లో కూడా పేలుళ్లు చోటుచేసుకునాన్నాయి. ఆపై సెయింట్ ఆంథోనీ ప్రార్థనామందిరం, సెయింట్ సెబాస్టియన్ చర్చిల్లోనూ విస్ఫోటనం జరిగింది. ఈస్టర్ పండుగ సందర్భంగా క్రైస్తవులు ప్రార్థనల్లో ఉండగా ఈ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. పేలుళ్లు జరిగిన ప్రాంతాలు క్షతగాత్రులతో తీవ్ర దిగ్భ్రాంతి కలిగించేలా ఉన్నాయి. ముఖ్యంగా, ఓ వ్యక్తి కదలిక లేకుండా పడివుండగా, పక్కనే ఓ చిన్నారి అత్యంత దీనంగా ఏడుస్తుండడం అందరినీ కలచివేస్తోంది.