సంబంధిత వార్తలు
- Sandeep Kishan: యుద్ధాలు ముగియవు, రాజులు మరణించరు అనే కాన్సెప్ట్ తో సందీప్ కిషన్ చిత్రం
- ఆడబిడ్డ పుట్టిందని 15 రోజుల పసికందును విషమిచ్చి చంపేసిన తండ్రి.. ఎక్కడ?
- Bhimavaram: ఎనిమిది మంది రౌడీ షీటర్లను అరెస్ట్ చేసిన భీమవరం పోలీసులు
- మధిరలో కృష్ణంరాజు డయాబెటిక్ వార్షిక హెల్త్ క్యాంప్ ప్రారంభించనున్న భట్టివిక్రమార్క
- 108 అశ్వాలు ఎస్కార్ట్ ... సోమనాథ్ ఆలయంలో ప్రధాని మోడీ పూజలు
BHIM: భీమ్ పేమెంట్స్ యాప్లో సరికొత్త బయోమెట్రిక్ ఫీచర్
Payments
ఈ కొత్త అప్డేట్ ద్వారా వినియోగదారులు రూ. 5,000 వరకు జరిపే లావాదేవీలకు తమ స్మార్ట్ఫోన్లోని వేలిముద్ర లేదా ఫేషియల్ రికగ్నిషన్ ఉపయోగించి సులభంగా ఆమోదం తెలపవచ్చు.
ఈ ఫీచర్తో ప్రతి చిన్న లావాదేవీకి యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. చాలా సందర్భాల్లో పిన్ మర్చిపోవడం లేదా తప్పుగా నమోదు చేయడం వల్ల చెల్లింపులు విఫలమవుతుంటాయి. ఈ కొత్త విధానం ద్వారా అలాంటి ఇబ్బందులకు తెరపడుతుంది.
ఈ సందర్భంగా ఎన్బీఎస్ఎల్ ఎండీ, సీఈవో లలితా నటరాజ్ మాట్లాడుతూ.. వినియోగదారులు తమ వేలిముద్ర లేదా ఫేస్ అన్లాక్ ద్వారా లావాదేవీలను నిర్ధారించడం వల్ల పిన్పై ఆధారపడటం తగ్గుతుంది.
అదే సమయంలో చెల్లింపులు యూజర్ బయోమెట్రిక్తో ముడిపడి ఉండటం వల్ల బలమైన భద్రత కూడా కొనసాగుతుంది" అని ఆమె వివరించారు.
