1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Jio 5G can help customers save money, the answer is JioAirFibre

5జీ ట్రూ 5జీ-దీపావళికి జియో 5జీ సేవలు...

5G technology
దీపావళికి జియో 5జీ సేవల్ని ప్రారంభిస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ ప్రకటించారు. జియో 5జీ ట్రూ 5జీ అని ప్రకటించారు. 
 
ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాలో దీపావళికి జియో 5జీ సేవలు ప్రారంభం అవుతాయని, ఆ తర్వాత ఇతర నగరాలు, పట్టణాల్లో జియో 5జీ వస్తుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద, అడ్వాన్స్‌డ్ 5జీ నెట్‌వర్క్‌గా జియో 5జీ ఉంటుందని చెప్పారు. 
 
జియో 5జీ సేవలతో బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్, నెట్వర్క్ కెపాసిటీ, కనెక్టెడ్ యూజర్స్ పెరుగుతారని అన్నారు. 2023 డిసెంబర్ నాటికి అంటే 18 నెలల్లో జియో అన్ని పట్టణాలకు విస్తరిస్తుంది. జియో ట్రూ 5జీ నెట్‌వర్క్ విస్తరించేందుకు రూ.2 లక్షల కోట్లు పెట్టుబడి పెడుతున్నామని ప్రకటించారు.
 
జియో 5జీ నెట్వర్క్ ద్వారా ఇప్పటికే మేడ్ ఇన్ ఇండియా 5జీ సిద్ధంగా ఉంది. రిలయన్స్ జియో వేలంపాటలో 5జీ స్పెక్ట్రం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
తర్వాతి కథనం
త్వరలోనే దేశ వ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్ సేవలు : ముఖేష్ అంబానీ