శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 జులై 2021 (18:04 IST)

అమెరికా ఐటీ సంస్థ కసేయాపై సైబర్ దాడి.. 17 దేశాలపై అది జరిగిందా.?

అమెరికా ఐటీ సంస్థ కసేయాపై గత శుక్రవారం సైబర్ దాడి జరిగింది. రాన్సమ్‌వేర్ దాడితో వందలాది వ్యాపార సంస్థల కార్యకలాపాలకు బ్రేక్ పడింది. అమెరికాతో పాటు మొత్తం 17 దేశాలపై సైబర్ దాడి జరిగినట్లు తెలుస్తోంది. 
 
రష్యాకు చెందిన ఈవిల్ గ్యాంగ్ ఆ సైబర్ అటాక్‌కు పాల్పడింది. వివిధ కంపెనీలు వాడే వీఎస్ఏ టెక్నాలజీపై సైబర్ నేరగాళ్లు దాడి చేశారు. దాడి వల్ల జరిగిన నష్టంపై సైబర్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 
 
తాజాగా జరిగిన సైబర్ దాడి విషయంలో ఈవిల్ గ్యాంగ్ తమ డార్క్ వెబ్‌సైట్‌లో హ్యాపీ బ్లాగ్‌లో డబ్బులు డిమాండ్ చేశారు. రాన్సమ్‌వేర్‌ను అన్‌లాక్ చేయాలంటే.. 520 కోట్లు ఇవ్వాలంటూ ఈవిల్ గ్యాంగ్ డిమాండ్ చేసింది. 
 
రాన్సమ్‌వేర్ అటాక్ వల్ల లక్షల సంఖ్యలో కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయి. అయితే సైబర్ దాడి జరిగిన రెండు రోజుల తర్వాత హ్యాకర్ల గురించి తెలిసింది. ఒకవేళ తాము డిమాండ్ చేసినట్లు పేమెంట్ చెల్లస్తే, అప్పుడు బాధితుల ఫైల్స్ డీక్రిప్ట్ అయ్యే విధంగా చూస్తామని ఈవిల్ గ్యాంగ్ తన ప్రకనటలో పేర్కొంది.