1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 మే 2021 (14:15 IST)

కీలక నిర్ణయం తీసుకున్న బ్యాంకులు.. ఆ సేవలు మాత్రమే..

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బ్యాంకు కరోనా కష్టకాలంలోనూ తమ ఖాతాదారులకు నిరంతరాయంగా సేవలు అందిస్తోంది. అదేసమయంలో బ్యాంకుకు సంబంధించిన విషయాలు.. ఖాతాకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా తమ కస్టమర్లకు తెలియజేస్తుంది. తాజాగా మరో విషయాన్ని ఎస్బీఐ ట్విట్టర్ వేదికగా తెలిపింది. 
 
ప్రస్తుతం దేశంలో కరోనా సృష్టిస్తున్న విలయాన్ని చూస్తునే ఉన్నాం. కోవిడ్ కట్టడికి ఆయా రాష్ట్రాలు లాక్డౌన్ విధానాన్ని అమలు పరుస్తున్నాయి. దీంతో బ్యాంక్ వర్కింగ్ టైమింగ్స్ కూడా మారాయి. ఆయా రాష్ట్ర లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా బ్యాంకులు తమ పని గంటలను కుదించుకున్నాయి.. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి బ్యాంక్ ఓపెనింగ్, క్లోజింగ్ టైమ్స్ మార్చేసింది. ఇక వర్కింగ్ టైంలో మాత్రమే పలు సేవలు అందుబాటులో ఉండనున్నట్లుగా ప్రకటించింది.
 
ఈ మేరకు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. కస్టమర్లు అత్యవసర పనులు ఉంటేనే తమ సమీప బ్యాంకు బ్రాంచుకు వెళ్ళాలని సూచించింది. ఇకపై ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే పనిచేస్తాయి. మే 31 వరకు ఇదే విధంగా పనిచేస్తాయి. అలాగే మధ్యాహ్నం 2 గంటల సమయంలో బ్యాంకులు క్లోజ్ అవుతాయి. 
 
అలాగే, బ్యాంకుకు వెళ్లేవారు కచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి. లేదంటే ఎంట్రీ ఉండదనే విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ సమయంలో బ్యాంకులో క్యాష్ డిపాజిట్, విత్ డ్రా, చెక్‌బుక్ సంబంధిత పనులు, డీడీ, నెఫ్ట్, ఆర్టీజీస్ పనులు, గవర్నమెంట్ చలాన్ వంటి పనులు మాత్రమే చేస్తారు. ఇతర చిన్నచిన్న పనులను మాత్రం తాత్కాలికంగా వాయిదా వేశారు.