శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 ఏప్రియల్ 2020 (13:39 IST)

ఒప్పో నుంచి కొత్త స్మార్ట్ ఫోన్.. భారత్‌లో ఐదు రోజుల తర్వాత విడుదల

OPPO Reno 2
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ సంస్థ ఒప్పో నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి రానుంది. మరో ఐదు రోజుల్లో ఒప్పో ఎస్ 2 ఫోన్ లాంచ్ కానుంది. ఏప్రిల్ 13న లాంచ్ అవుతున్న ఈ ఫోన్ మొదట చైనాలో లాంచ్ కానుండగా ఆ తర్వాత భారత్‌లో విడుదల కానుంది. 
 
2019 అక్టోబర్‌లో ఒప్పో రెనో ఏస్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. ఒప్పో ఆ ఫోన్‌కు తర్వాత వెర్షన్‌గా ఈ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఈ ఫోనును ఒప్పో రెనో బ్రాండ్‌ను తీసేసి ఒప్పో ఏస్ 2 పేరుతో లాంచ్ చేయనుంది. 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే కలిగిన ఈ ఫోన్.. ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్‌ను కూడా కలిగివుంది. 
 
ఫీచర్లు.. 
5జీ ప్లస్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 చిప్ సెట్
43 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా
3910 ఎంఏహెచ్ బ్యాటరీ
16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
65 వాట్స్ వైర్డ్ చార్జింగ్, 40వ్ వైర్ లెస్ చార్జింగ్ ఫీచర్లు
8జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్, 2 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ స్టోరేజ్.