1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. UPI users may not be able to do transactions between 1 AM to 3 AM for next few days,

యూపీఐ ద్వారా డిజిటల్ పేమెంట్స్ వద్దు

UPI users
UPI
యూపీఐ ద్వారా డిజిటల్ పేమెంట్స్ చేసే వారికి ముఖ్య గమనిక. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌(యూపీఐ)ని అప్‌గ్రేడ్ చేస్తున్న నేపథ్యంలో రాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 3 గంటల మధ్యలో పేమెంట్స్ చేయొద్దని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) సూచించింది. 
 
అయితే అది ఎన్ని రోజులనేది ఎన్‌పీసీఐ చెప్పలేదు. కొద్ది రోజుల పాటు యూజర్లు అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంది. చెల్లింపుల విషయంలో ముందే ప్లాన్ చేసుకోవాలని సూచించింది.

''మీకు మంచి, సురక్షితమైన చెల్లింపు అనుభవం ఉండటానికి, మేము మా యుపిఐ ప్లాట్‌ఫామ్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నాము. రాబోయే కొద్ది రోజులకు యుపిఐ వినియోగదారులు అర్ధరాత్రి 1 నుండి తెల్లవారుజాము 3 గంటల వరకు అసౌకర్యాన్ని ఎదుర్కొంటారు" అని ట్విట్టర్‌లో అధికారిక ఎన్‌పిసిఐ ఖాతా పేర్కొంది. 
 
అభివృద్ధి చెందుతున్న సైబర్ బెదిరింపులను ఎదుర్కోవటానికి బహుళ-లేయర్డ్ రక్షణ విధానాన్ని పెంచే NPCI తన భద్రతా భంగిమను అప్‌గ్రేడ్ చేయడానికి వివిధ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రయోగించిందని కూడా ఇది పేర్కొంది.
About Writer
సెల్వి