మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 12 జూన్ 2020 (20:17 IST)

ప్రతి పొలానికీ సాగునీరు: బీహార్‌ ముఖ్యమంత్రి

రానున్న కాలంలో బీహార్‌లో ప్రతి పొలానికి సాగునీరు అందించడమే తన లక్ష్యమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ పేర్కొన్నారు.

జనతాదళ్‌ యునైటెడ్‌ పార్టీ కార్యకర్తలు సుమారు ఐదు వేల మందితో ఆన్‌లైన్‌లో మాట్లాడిన నితీష్‌ రానున్న ఎన్నికల్లో తన ప్రధాన హామీలను వివరించారు.

బీహార్‌లో 80 శాతం ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రతి పొలానికీ సాగునీరు అనే ఎన్నికల హామీ ప్రజల్లో నిజంగానే ఆశలు రేకితిస్తుంది.

ఈ హామీతోపాటు అందరికీ విద్యుత్‌ సరఫరా, పైపుల ద్వారా మంచినీరు సరఫరా కూడా ఇస్తామని నితీష్‌ హామీ నిచ్చారు. వ్యవసాయానికి అసరమైన కరెంట్‌ నిరంతరం సరఫరా చేసేందుకు ప్రత్యేక ఫీడర్లును ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు.