1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Madhya pradesh teacher jumped with 8th class student

ఎనిమిదో తరగతి విద్యార్థితో జంప్ అయిన 26 ఏళ్ల టీచర్

Madhya pradesh
ఉపాధ్యాయ వృత్తికి ఓ ఉపాధ్యాయురాలు కళంకం తెచ్చేలా ప్రవర్తించింది. బుద్ధిగా పాఠాలు చెప్పాల్సిన ఆ ఉపాధ్యాయురాలు.. ఎనిమిదో తరగతి చదివే విద్యార్థితో ప్రేమలో పడింది. ఇంకా స్కూలు నుంచి అతనితో పారిపోయింది. ఈ ఘటన గుజరాత్‌లోని గాంధీనగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్కూలుకెళ్లిన తన కుమారుడు తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆరా తీసిన తండ్రి అసలు విషయం తెలిసి షాకయ్యాడు. 
 
ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పాఠశాలలో తన కుమారుడికి పాఠాలు చెప్పకుండా మాయమాటలు చెప్పి.. కుమారుడిని వలలో వేసుకుందని.. విద్యార్థి తండ్రి ఆరోపించాడు.  ఏడాదిగా ఈ తతంగం నడుస్తున్నా తను గుర్తించలేకపోయానని వాపోయాడు. వారిద్దరినీ పట్టుకుని తన కుమారుడిని తనకు అప్పగించాల్సిందిగా కోరాడు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. కాగా టీచర్‌కు 26 సంవత్సరాలని.. ఏడాది పాటు ఎనిమిదో తరగతి కుర్రాడితో ఆమె చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నా : డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామా